ఆమెకు హైదరాబాద్ యువకులే టార్గెట్

ఆమెకు హైదరాబాద్ యువకులే టార్గెట్

హైదరాబాద్: పెళ్లయ్యింది..ఇద్దరు పిల్లలు.. భర్తతో జీవనం సాగిస్తూనే ఓ కిలాడీ లేడీ సోషల్ మీడియాలో యువకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతుంది. కొన్ని నెలలుగా యువకులనే టార్గెట్ చేస్తూ.. ప్రేమ పేరుతో వల వేస్తుంది. కొన్ని రోజులు ఎంజాయ్ చేసి.. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది. అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి.. లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేస్తుంది. కేరళకు చెందిన ఈమె చేతిలో మోస పోయాడు హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు. ఇద్దరు పిల్లలు, భర్తతో జీవనం సాగిస్తూ... ఈ మోసాలకు పాల్పడుతోందని తర్వాత తెలిసిందని చెప్పాడు. భారీ మొత్తం డబ్బులు లాగిందని.. ఈ మహిళా చేతిలో మోసపోయానంటూ న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. స్పందించిన హెచ్చార్సీ నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మాయలేడీ చేతిలో చాలామంది హైదరాబాద్ యువకులు మోసపోయారని చెప్పుకొచ్చాడు బాధితుడు.