
బిగ్ బాస్ హౌస్లో లేటుగా ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి తనకు ఇచ్చిన దొంగళ రాణి క్యారెక్టర్ను సక్సెస్ పుల్ గా చేసింది. అలీ, శ్రీముఖి, హిమజ, వితిక ఎంత ట్రైచేసినా.. తన వద్దనుంచి తుపాకీని గుంజుకోలేకపోయారు. తనను సింహాసనం నుంచి పక్కకు జరపాలని చూసినా… రాహుల్, వరుణ్ల సహాయంతో నిలదొక్కుకుంది. ఈ ప్రయత్నంలో తనకు దెబ్బలు తగిలినా నిలబడింది. అయితే ఇందులో హింస ఎక్కువవడంతో బిగ్ బాస్ టాస్క్ ను ఆపేశాడు. ఈ విషయంపైనే వీకెండ్ ప్రోగ్రాంలో.. నాగార్జున హౌజ్ మేట్లను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రోమోలో శిల్ప తన బాధను నాగ్ కు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది.