డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందన్న ఆరోపణలపై శిల్పాశెట్టి స్పందించింది. తనను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారని శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది. తన జీవితంలో డబ్బు ఎప్పుడు ప్రభావితం చేయాలదన్నారు. రాజ్ కుంద్రాను డబ్బు చూసి పెళ్లి చేసుకోలేదని, అతడి మనసు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లుగా శిల్పాశెట్టి వెల్లడించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్పా శెట్టి ఈ విషయాలను వెల్లడించింది. తాను రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నప్పుడు, యాదృచ్ఛికంగా అతను మంచి స్థానంలో ఉన్నాడని తెలిపింది. మేము కలిసి జీవించాలని దేవుడు నిర్ణయించాడని తెలిపిందిజ. శిల్పా, రాజ్లు 2009లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ALSO READ :-భారత్ మమ్మల్ని క్షమించాలి: మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు
ఇక గతంలో రాజ్కుంద్రా తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. ‘‘మేము విడిపోతున్నాం. దయచేసి ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్గా నిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా’’ అని పోస్ట్ చేశారు. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటుందని మీడియా ప్రచారం చేసింది. అయితే, కొన్ని సంవత్సరాలుగా తాను ధరించిన మాస్క్కు గుడ్బై చెప్పే క్రమంలో ఆయన ఈ పోస్ట్ చేశారు.