vikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ

vikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారు తెలిపిన వివరాలు.. జూన్ 10 న అనిల్ (మృతురాలి బావ) శిరీషను తిట్టాడు. దీంతో ఇంట్లో నుంచి ఆమె అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో జూన్​ 11 న గ్రామ శివారులోని కుంటలో శిరీష మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బావతో జరిగిన గొడవపై వారు ఆరా తీశారు. అనిల్​ భార్య లలిత మాట్లాడుతూ.. ఇంట్లో పని చేయడం లేదని మాత్రమే తన చెల్లిని మందలించినట్లు చెప్పారు.  తన చెల్లికి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని యువతి సోదరుడు తెలిపాడు.  తల్లి ఆరోగ్యం బాలేకపోవడంతో తాను హైదరాబాద్​ వెళ్లినట్లు చెప్పాడు. చెల్లి హత్య విషయం తనకూ మధ్యాహ్నమే తెలిసినట్లు మీడియాకి వెల్లడించాడు.  కాగా శిరీష మృతదేహానికి ఇంకా పోస్ట్​మార్టం పూర్తి కాలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.