
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ రూపొందించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. శివ కందుకూరి మాట్లాడుతూ ‘సినిమా మొదలుపెట్టినప్పుడు అవుట్పుట్ బాగా వస్తే చాలనుకున్నాం. తర్వాత కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని, ఆ తర్వాత ఒక మంచి హిట్ కొడితే బాగుణ్ణు అని టీమ్ అంతా అనుకున్నాం.
మేము అనుకున్నట్టే ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. తాము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి రావడం హ్యాపీగా ఉందని చెప్పింది రాశీ సింగ్. దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ ‘సినిమా హౌస్ ఫుల్ షోస్తో రన్ అవుతోంది. శివ ఈ సినిమాని బలంగా నమ్మారు. ఇంకా మంచి కథలు చేయగలననే నమ్మకం వచ్చింది’ అన్నాడు. ఈ కంటెంట్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారని నిర్మాతలు చెప్పారు.