డ్రగ్స్ కేసులో సిద్ధాంత్ కపూర్ కు బెయిల్

డ్రగ్స్ కేసులో సిద్ధాంత్ కపూర్ కు బెయిల్

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. 'సిద్దాంత్ కు సోమవారం ఆలస్యంగా బెయిల్‌ వచ్చింది. అరెస్టయిన మిగతా నలుగురు కూడా బెయిల్‌పై విడుదలయ్యారని పోలీసులు తెలిపారు. సిద్ధాంత్ కపూర్  తో పాటు మరో నలుగురు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని తూర్పు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ భీమా శంకర్ గుల్లెద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

సిద్ధాంత్ కపూర్ ను ఆదివారం రాత్రి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో  పాజిటివ్ రావడంతో  అరెస్టు చేసినట్లు పోలీసులు  తెలిపారు.  ఆదివారం రాత్రి బెంగళూరులోని పార్క్ హోటల్ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీకి సిద్ధాంత్ కపూర్‌ను డిజెగా ఆహ్వానించారు. అక్కడ అతను డ్రగ్స్ సేవించాడు.  పక్కా సమాచారం మేరకు పోలీసులు హోటల్‌పై దాడి చేసి 35 మంది అతిథులకు వైద్య పరీక్షలు చేశారు. అందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. వారిలో శక్తి కపూర్ ఒకరని అధికారులు తెలిపారు. సిద్ధాంత్ కపూర్‌తో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి.. వారందరిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద అభియోగాలు మోపారు.