
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మడాక్ ఫిలింస్ నిర్మిస్తోంది. గురువారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేశారు. నార్త్ ఇండియాకు చెందిన ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), దక్షిణాదికి చెందిన ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య జరిగే ప్రేమకథ ఇది.
భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు విషయంలో భిన్న ధృవాలైన వీరి పెళ్లికి ఎలాంటి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి అనేది వినోదభరితంగా తెరకెక్కించినట్టు టీజర్తో అర్థమవుతోంది. కేరళలోని బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీసిన విజువల్స్, సిద్ధార్థ్, జాన్వీ కపూర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న సోను నిగమ్ పాట టీజర్లో హైలైట్గా నిలిచాయి.
టీజర్ చివర్లో జాన్వీ కత్తిపట్టుకుని రావడం ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జులై 25న సినిమా విడుదల కానుంది.