పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, కియారా

పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, కియారా

బాలీవుడ్ లవ్ కపూల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యఘడ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య  జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, షాహిద్ కపూర్, జుహీ చావ్లా, మీరా రాజ్‌పుత్ కపూర్ తదితరులు హాజరయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, కియారాల పెళ్లిపై ఈ మధ్య వార్తలు వచ్చినప్పటికీ ఇద్దరు కామ్ గానే ఉన్నారు. 2021లో విడుదలైన షేర్షా షూటింగ్ టైమ్ లో సిద్ధార్థ్, కియారా ప్రేమలో పడ్డారు.