
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో గుండె వ్యాధుల కోసం త్వరలో క్యాథ్ల్యాబ్ ప్రారంభించనున్నట్లు సింగరేణి చీఫ్ మెడికల్ఆఫీసర్(కొత్తగూడెం కార్పొరేట్) కిరణ్రాజ్కుమార్ తెలిపారు. సోమవారం గోదావరిఖని జీఎం ఆఫీసులో జీఎం డి.లలిత్ కుమార్, ఇతర ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్న నేపథ్యంలో సీఎండీ బలరామ్ ఆదేశాల మేరకు గోదావరిఖని హాస్పిటల్లో క్యాథ్ల్యాబ్ యూనిట్ను నెలకొల్పుతున్నామన్నారు. రెండు, మూడు నెలల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే హాస్పిటల్లో డాక్టర్లు, స్టాఫ్ కొరతపై చర్చించారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సివిల్ డీజీఎం వరప్రసాద్, వీరారెడ్డి, జీఎల్ రాజు, మోహన్ రావు, బ్రహ్మాజీ, సాంబశివరావు పాల్గొన్నారు.