సింగ‌‌రేణిలో 327 పోస్టులు..నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

సింగ‌‌రేణిలో 327 పోస్టులు..నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
  • ఏప్రిల్‌‌ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు

హైదరాబాద్‌‌, వెలుగు: 327 పోస్టుల భ‌‌ర్తీకి సింగరేణి సంస్థ గురువారం నోటిఫికేష‌‌న్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్‌‌ లో మేనేజ్‌‌మెంట్‌‌ ట్రెయినీ (ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్‌‌ లో 42, మేనేజ్‌‌మెంట్‌‌ ట్రెయినీ (సిస్టమ్స్‌‌) ఈ2 గ్రేడ్‌‌ లో 7 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

అదే విధంగా నాన్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ కేడర్‌‌లో జూనియర్‌‌ మైనింగ్ ఇంజనీర్‌‌ ట్రెయినీ (జేఎంఈటీ) టీ అండ్‌‌ ఎస్‌‌ గ్రేడ్‌‌–సీలో 100, అసిస్టెంట్‌‌ ఫోర్‌‌ మెన్‌‌ ట్రెయినీ (మెకానికల్‌‌) టీఅండ్‌‌ఎస్‌‌ గ్రేడ్‌‌–సీలో 9, అసిస్టెంట్‌‌ ఫోర్‌‌ మెన్‌‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌‌ ) టీఅండ్‌‌ఎస్‌‌ గ్రేడ్‌‌–సీలో 24, ఫిట్టర్‌‌ ట్రెయినీ కేటగిరీలో 47, ఎలక్ట్రీషియన్‌‌ కేటగిరీలో 98 పోస్టులను భర్తీ చేయనుంది.

ఏప్రిల్‌‌ 15 నుంచి మే 4న సాయంత్రం 5గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. www.scclmines.com వెబ్‌‌సైట్‌‌ ద్వారా అప్లై చేసుకోవాలని సంస్థ సూచించింది. వయోపరిమితి గరిష్టంగా 30 ఏండ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు మరో ఐదేండ్లు సడలింపు ఉంటుందని చెప్పింది. సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వయోపరిమితి ఏమీ ఉండదని పేర్కొంది.