సింగరేణిలో మరో 6 నెలలు సమ్మెపై నిషేధం

సింగరేణిలో మరో 6 నెలలు సమ్మెపై నిషేధం
  • ఉత్తర్వులు జారీ చేసిన  ప్రభుత్వం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  సింగరేణి సంస్థలో మరో ఆరు నెలలు పాటు సమ్మెపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎసెన్షియల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ మెయింటెనెన్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 1971 ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మెలపై నిషేధం విధిస్తూ ఎనర్జీ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ ఎస్‌‌‌‌ఏఎం రిజ్వీ బుధవారం జీవో విడుదల చేశారు. మార్చి 11 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.