- సప్లయ్పై దృష్టి పెట్టని యాజమాన్యం
కోల్బెల్ట్, వెలుగు : సరిపడా పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోంది. కంపెనీ నినాదమైన ‘రక్షణే ప్రథమం.. రక్షణే లక్ష్యం.. రక్షణే గమ్యం..’ను ఉన్నతాధికారులు గాలికొదిలేస్తున్నారు. గనుల్లో ఫస్ట్ఎయిడ్కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. చేతులకు గాయాలు కాకుండా గ్లౌజ్లు, కళ్లకు రక్షణగా కళ్ల జోళ్లు, చెడు గాలి ముక్కులోకి వెళ్లకుండా మాస్కులు సరఫరా చేయడం లేదు. బురద ప్రాంతంలో డ్యూటీలు చేసే కార్మికులకు గమ్షూలు ఇవ్వడంలేదు. డ్రిల్ రాడ్లు క్వాలిటీ లేక మధ్యలోకి విరిగిపోవడంతో కార్మికులు ప్రమాదాల బారినపడుతున్నారు.
అండర్ గ్రౌండ్ మైన్లలో పనిచేసేవారికి బూట్లు, హెల్మెట్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. డ్రిల్ బిట్లు, డ్రిల్రాడ్లతోపాటు చెమ్మస్, ఎస్డీఎల్, ఎల్హెచ్డీ మిషన్విడిభాగాలను అందించడం లేదని చెబుతున్నారు. ఉన్నవాటితో సర్దుకుని పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. బొగ్గు నింపడానికి కనీసం పది మందికి ఒక తట్టా, చెమ్మస్సమకూర్చడం లేదంటున్నారు.
క్వాలిటీ లేకనే ప్రమాదాలు
సింగరేణి ఆఫీసర్లు బొగ్గు టార్గెట్లు ఇస్తున్నారే తప్ప కార్మికులకు అవసరమైన పనిముట్లను అందించడం లేదు. అందుబాటులో ఉంచుతున్న వస్తువుల్లో క్వాలిటీ ఉండటం లేదు. పనిచేస్తున్న టైమ్లో విరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిపడా డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్లు ఇవ్వడం లేదు. బూట్లు క్వాలిటీగా ఉండడం లేదు. యాజమాన్యం స్పందించి సరిపడా క్వాలిటీ పనిముట్లు ఇవ్వాలి.
- భీమనాథుని సుదర్శనం, ఏఐటీయూసీ లీడర్