సింగరేణి స్థాయి కబడ్డీ, బాల్ ​బ్యాడ్మింటన్​ పోటీలు ప్రారంభం

సింగరేణి స్థాయి కబడ్డీ, బాల్ ​బ్యాడ్మింటన్​ పోటీలు ప్రారంభం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి స్థాయి కబడ్డీ, బాల్​బ్యాడ్మింటన్​పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోటీలను జీఎం పర్సనల్​ కె. బసవయ్య, జీఎం ఎ. కుమార్​రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు గేమ్స్ జరుగనున్నాయని తెలిపారు.

కబడ్డీ విభాగంలో బెల్లంపల్లి– మందమర్రి, కొత్తగూడెం కార్పొరేట్​జట్ల మధ్య జరిగిన పోటీలో బెల్లంపల్లి – మందమర్రి జట్టు విజయం సాధించింది. ఆర్జీ 1 – 2 జట్టుతో ఆర్జీ 3 – భూపాలపల్లి జట్టు తలపడగా ఆర్జీ 1 – 2 జట్టు గెలిచింది. బాల్​బ్యాడ్మింటన్​ విభాగంలో శ్రీరాంపూర్​ జట్టుతో ఇల్లెందు – మణుగూరు తలపడగా శ్రీరాంపూర్​ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆర్జీ 1–2, బెల్లంపల్లి – మందమర్రి జట్ల మధ్య పోరులో బెల్లంపల్లి – మందమర్రి జట్టు గెలిచింది.