యాప్స్‌‌లో అప్పులు.. యువకుడు సూసైడ్‌‌..సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘటన

యాప్స్‌‌లో అప్పులు.. యువకుడు సూసైడ్‌‌..సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘటన

సిరిసిల్ల టౌన్, వెలుగు : వివిధ యాప్స్‌‌లో తీసుకున్న అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గణేశ్‌‌నగర్‌‌కు చెందిన రామకృష్ణ (24) డిగ్రీని మధ్యలోనే ఆపేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.

జల్సాలకు అలవాటు పడిన యువకుడు ఖర్చుల కోసం వివిధ ఆన్‌‌లైన్‌‌ యాప్స్‌‌లో సుమారు రూ. 2 లక్షల వరకు అప్పులు తీసుకున్నాడు. అవి తీర్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి తండ్రి లింగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్‌‌ సీఐ తెలిపారు.