
హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలాల రికార్డు కొనసాగుతూనే ఉంది. దర్యాప్తులో భాగంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు సిట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈటల రాజేందర్ మంగళవారం సిట్ ఎదుట హాజరుకానున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బిల్ల సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సోమవారం సిట్కు వాంగ్మూలం ఇచ్చారు.
తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.. ట్యాపింగ్ లిస్టులో ఉన్న నంబర్ ఎవరు వినియోగిస్తున్నారు.. ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అని సిట్ అధికారులు అడిగినట్లు తెలిపారు. ఆయా సందర్భాల గురించి వివరించినట్టుగా చెప్పారు.2023 ఎలక్షన్స్ సమయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జ్ గా పనిచేసిట్లు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. తాను ఎవరితో మాట్లాడుతున్నామో గుర్తించేవారిని, మఫ్టీలో పోలీసులు ఫాలో అయ్యేవారని చెప్పారు.