గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ అతీక్ లాయర్‌‌‌‌ అరెస్ట్‌‌

గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ అతీక్ లాయర్‌‌‌‌ అరెస్ట్‌‌

న్యూఢిల్లీ: గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ అతీక్ అహ్మద్‌‌ లాయర్‌‌‌‌ను ఉత్తరప్రదేశ్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్‌‌పాల్‌‌ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేశ్‌‌పాల్‌‌ను చంపిన ఘటన లో లాయర్‌‌‌‌ విజయ్‌‌ మిశ్రా షూటర్స్‌‌కు సహాయం చేశాడని పోలీసులు వెల్లడిం చారు. పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత లక్నోలోని హోటల్‌‌ హయత్‌‌ లెగసీ బయట మిశ్రాను అరెస్ట్‌‌ చేశారు. 

కాగా, పట్టపగలు యూపీలో ఉమేశ్‌‌ పాల్‌‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్‌‌ మీడియలో వైరల్‌‌ అయ్యింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమస్యలపై పలువురు ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ రాష్ట్రంలో మాఫియాను నాశనం చేస్తానని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశారు.