ఉద్యోగుల హెచ్​ఆర్​ఏలో స్వల్ప మార్పులు

ఉద్యోగుల హెచ్​ఆర్​ఏలో స్వల్ప మార్పులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్​ఆర్​ఏలో స్వల్ప మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. శంషాబాద్​, జల్​పల్లి, శామీర్​పేట ప్రాంతాల్లోని ఉద్యోగులకు 24 శాతానికి హెచ్​ఆర్​ఏను పెంచారు.  గతంలో 13 శాతం హెచ్​ఆర్​ఏ ఉన్నది. జీహెచ్​ఎంసీ నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పెంచిన హెచ్ఆర్​ఏ వర్తింస్తుందని జీవోలో పేర్కొన్నారు. హెచ్​ఆర్ఏ పెంపును టీఎన్జీవో  నేతలు స్వాగతించారు.సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌‌రావు, సీఎస్ సోమేశ్​కుమార్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావులకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ ధన్యవాదాలు తెలిపారు.