కేంద్రమంత్రి అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అమిత్ షా రేపు(ఆగస్టు 27) భద్రాచలం, ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల అమిత్ షా భద్రాచలం పర్యటన రద్దయింది.
అమిత్ షా ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు ఏపీలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఖమ్మం వెళ్తారు. మధ్యాహ్నం3.45 నుంచి 4.35 వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత పార్టీ ముఖ్య నేతలతో వచ్చే ఎన్నికలపై చర్చించనున్నారు. తిరిగి సాయంత్రి 5.45 కు హెలికాప్టర్ లో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 6.25 కు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారి ఖమ్మం వస్తుండడంతో మీటింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ గ్రౌండ్లోని స్టేడియం దగ్గర ఏర్పాట్లను శుక్రవారం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలి