పూరి గుడిసెలు మాకు, ఫాంహౌజులు మీకా?

 పూరి గుడిసెలు మాకు, ఫాంహౌజులు మీకా?
  • డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గంగాధర తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

కరీంనగర్: పూరి గుడిసెలు మాకు, ఫాంహౌజులు మీకా? అంటూ చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర తాహశీల్దార్ కార్యాలయం ముందు నిరుపేదలు ఆందోళనకు దిగారు. తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడంలో విఫలమైన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం గంగాధర తాహశీల్దార్ కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ లకు స్థలాన్ని వెంటనే కేటాయించాలి.. నిరుపేదలకు 3 ఎకరాలు భూమి వెంటనే కేటాయించాలి.. అంటూ నినాదాలు చేస్తూ కొద్దిసేపు బైఠాయించారు. నాయకులకు ఫామ్ హౌస్ లు, పేదలకు పూరి గుడిసెలా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించడం చేతకాకపోతే తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.