సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర రైలును ఆపి సహాయక చర్యలు చేపట్టారు.

బీ4 బోగీలో బ్యాటరీలో క్యాప్ లీక్ కావండతోనే ఈ పొగలు వచ్చినట్లు గుర్తించిన సిబ్బంది.. వెంటనే మరమత్తులు చేపట్టారు. దీంతో దాదాపు 2 గంటలపాటు రైలును నిలిపేయాల్సి వచ్చింది. మరమ్మతుల అనంతరం రైలు యథావిథిగా అక్కడి నంచి బయల్దేరి వెళ్లిపోయింది.