సామాజిక న్యాయం పాటించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

సామాజిక న్యాయం పాటించాలి  : జాజుల శ్రీనివాస్ గౌడ్

 హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎంపీ టికెట్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించాలన్నారు. దేశ వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాజకీయ పదవులు దక్కాలని బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు.

  కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో బీసీలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవుల్లో 13 మంది బీసీలకే అవకాశం ఇచ్చారని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మరికొంత మంది బీసీలకు పదవులు ఇవ్వాలన్నారు.