ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన రేపాకుల విష్ణు కుమార్ పడవ ప్రమాదంలో గల్లంతయ్యాడు. విష్ణుకుమార్ హైదరాబాద్ లో యాస్ టెక్నాలజిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజులు సెలవు రావడంతో స్నేహితులతో కలసి పాపికొండల టూరుకు వెళ్లాడు. అతడి సమాచారం తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విష్ణుకుమార్ క్షేమంగా ఉన్నాడని అక్కడివారు చెబుతున్నా… మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదంటున్నారు.
