బషీర్బాగ్, వెలుగు: ఎలక్ట్రిక్ బైక్ ఫ్లైఓవర్పై నుంచి పడిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. కాచిగూడ సీఐ జ్యోత్స్, ఎస్సై భరత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడకు చెందిన అశోక్ గుప్త కుమారుడు శిరీష్(33) పుణేలో సాఫ్ట్వేర్ఇంజినీర్గా చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి తన ఎలక్ట్రికల్ బైక్ పై గోల్నాక నుంచి రామంతాపూర్ లో ఉండే స్నేహితుడి వద్దకు వెళ్తున్నాడు.
మార్గమధ్యలో అంబర్ పేట్ బ్రిడ్జి(ఛే నంబర్ వద్ద)పై వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో శిరీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
హెల్మెట్ ఊడిపోవడంతో..
శిరీష్ హెల్మెట్కు సేఫ్టీ క్లిప్పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడే సమయంలో అతని తలకు ఉన్న హెల్మెట్ఊడిపోయిందన్నారు. శిరీష్తల బలంగా రోడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు హెల్మెట్తలకు తగిలించుకుంటే సరిపోదని తప్పకుండా సేఫ్టీ క్లిప్పెట్టుకోవాలని సూచించారు. .
గూడ్స్ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన ఎన్.యాదగిరి(65) సోమవారం పెరుగు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లాడు.
మున్సిపల్ ఆఫీస్ సమీపంలో రోడ్డు దాటుతుండగా అయోధ్య క్రాస్రోడ్డు నుంచి గుండ్లపోచంపల్లి వైపు వెళ్లే గూడ్స్ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
