మణిపూర్ లో దారుణం.. ఆర్మీ సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య

మణిపూర్ లో దారుణం.. ఆర్మీ సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య

మణిపూర్ లో దారుణం జరిగింది. సెలవులో ఇంటికి వెళ్లిన ఆర్మి సైనికుడిని  గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేసి హత్య చేశారు.  రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేయగా..సెప్టెంబర్ 17న  అతని మృతదేహం ఇంఫాల్ తూర్పులోని మోంగ్జామ్‌కు తూర్పున ఉన్న ఖునింగ్‌థెక్ గ్రామంలో గుర్తించారు పోలీసులు. తలపై కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. సైనికుడి తలపై ఒకే బుల్లెట్ గాయం ఉందని చెప్పారు.

ఇంటి దగ్గర  వరండాలో తన తండ్రి పని చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 16న ఉదయం ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వైట్ కారులో కిడ్నాప్ చేశారని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరో వైపు  సైనికుడి హత్యను ఆర్మీ ఖండించింది. అతని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపింది. ఆర్మీకి ఓ భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సైనికుడి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల కోరిక మేరకు నిర్వహించబడతాయి. మృతుల కుటుంబానికి సహాయం చేయడానికి సైన్యం ఒక బృందాన్ని పంపింది.