అత్తింటి వేధింపులతో అల్లుడు మృతి

అత్తింటి వేధింపులతో అల్లుడు మృతి

అత్తింటి వేధింపులు పడలేక కోడలు మృతి చెందిన ఘటనలు కోకొల్లలు. కానీ, అత్తింటి పోరు పడలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగింది. కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లో నివసించే సయ్యద్ మోహిన్ అనే 23 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాబానగర్‌కు చెందిన సయ్యద్ మోహిన్‌కు కామారెడ్డికి చెందిన యువతితో సంవత్సరం క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల వరకూ వారి కాపురం సజావుగానే సాగింది. కానీ కొన్నాళ్ల తర్వాత వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దాంతో మహిళ తన అత్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మహిళ తన తల్లిదండ్రులతో కామారెడ్డిలోనే ఉంటుంది. మహిళ తల్లిదండ్రులే వారి కాపురంలో చిచ్చుపెట్టారని సయ్యద్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నాటినుంచే సయ్యద్‌కు మహిళ పేరంట్స్ చుక్కలు చూపించారని వారు అంటున్నారు. మొదటి నుంచి అత్తమామలతో గొడవలు.. భార్యభర్తలు వేరుగా ఉండటం.. వీటన్నింటితో విసుగుచెందిన సయ్యద్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

For More News..

కడుపునొప్పని బాలుడిని ఆస్పత్రికి తీసుకెళితే.. కడుపులో ఊహించని విధంగా..

తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు

బిడ్డ మరణం తట్టుకోలేక తండ్రి సూసైడ్