తల్లి పాసైన అకాడమీలోనే కొడుకు ఉత్తీర్ణత

తల్లి పాసైన అకాడమీలోనే కొడుకు ఉత్తీర్ణత

మామూలుగా కుటుంబంలో ఒకరు గవర్నమెంటు టీచర్ లేదంటే డాక్టర్ ఉన్నారంటే.. ఆ ప్రభావం ఆ కుటుంబంలోని పిల్లల పైన కచ్చితంగా ఉంటుంది. వాళ్లు కూడా అదే వృత్తిని ఎంచుకోవడం కూడా చాలా కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. అలాగే కుటుంబంలో ఒకరు ఆర్మీలోకి వెళ్తే.. మిగతా వాళ్లు కూడా సైన్యం బాట పట్టేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. విధులు నిర్వర్తిస్తూనే తండ్రి లేదా ఇతర కుటుంబీకులు చనిపోయినా...తానూ ఆర్మీలో చేరాలని ఆరాటపడే కొడుకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే తాజాగా చెన్నైలో జరిగింది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఓ తల్లీ, కొడుకుల కథ. 

సరిగ్గా 27ఏళ్ల కిందట అంటే 1995లో ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యి సైన్యంలో ఓ మహిళ పని చేయగా... ఇప్పుడు ఆమె కొడుకు కూడా అదే  ట్రైనింగ్ అకాడమీలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది ఆ అకాడమీలో తన కొడుకుతో కలిసి ఫొటో దిగారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. అందుకే ఈ విషయాన్ని  చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటివి జరగటం చాలా అరుదు. 27 ఏళ్లక్రితం 1995లో చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యారు రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది. ఇప్పుడు ఇదే ట్రైనింగ్ అకాడమీలో వాళ్ల అబ్బాయి కూడా ఉత్తీర్ణత సాధించాడు అంటూ, వాళ్లిద్దరూ దిగిన ఓ ఫొటోను డిఫెన్స్ షేర్ చేసింది. అంతే కాదు 1995లో చతుర్వేది పాస్ అయినప్పటి ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ అరుదైన ఘనతపై స్మిత చతుర్వేది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో అకాడమీలో జరిగిన మార్పులను వివరించిన ఆమె... అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.