కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే : రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే : రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ

నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఈ మేరకు ఏఐసీసీ జాబితాను  విడుదల చేసింది.  రాజస్థాన్‌ నుంచి సోనియా గాంధీ పోటీలో ఉన్నట్లు తెలిపింది, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, బీహార్ నుంచి  అఖిలేష్ ప్రసాద్ సింగ్, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండేరే  లను నామినేట్‌ చేసింది.  

రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ బుధవారం జైపూర్‌కు  వచ్చారు.  రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆమె ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న సోనియా..  లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి.  

ALSO READ :- కూర్చో అనగానే కూర్చోడానికి మేము పాలేర్లం కాదు : మంత్రి పొన్నం

గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభలో అడుగుపెట్టిన తొలి సభ్యురాలు సోనియా కాదు.  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా 1964  ఆగస్టు నుండి 1967 ఫిబ్రవరి వరకు ఎగువ సభలో సభ్యురాలుగా ఉన్నారు. కాగా  2024 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి పోటీ చేయవచ్చని ఊహాగానాలు జోరందుకున్నాయి. 

దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.   50 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది.ప్రస్తుత రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులు ఉండగా, బీజేపీ అత్యధికంగా 93, కాంగ్రెస్ 30, తృణమూల్ కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ 10, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలకు 10 స్థానాలు ఉన్నాయి.