
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్షాలు ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో విపక్ష నేతలు నిరసనలు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నాఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ‘NO CAA’, ‘Save Constitution’ అనే నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని విపక్ష నేతలు తమ నిరసన తెలిపారు. కాగా అంతకుముందు పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపై విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జామీయానగర్ కాల్పుల ఘటన, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నాఆర్సీ, ఎన్పీఆర్లపై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించినట్లు సమాచారం.
#WATCH Delhi: Opposition leaders including Congress Interim President Sonia Gandhi protest in front of Gandhi statue in Parliament premises, against #CAA_NRC_NPR #BudgetSession pic.twitter.com/wolQCzvz0Q
— ANI (@ANI) January 31, 2020