రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ!

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ!

రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ..రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.  ఈ నెల14న రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, సోనియా గాంధీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు కోరిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం.