లాక్ డౌన్ టైమ్ లో చాలామందికి సహాయం చేసిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్’ (DIYA) సహకారంతో ఉచిత ఐఏఎస్ కోచింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ‘సంభవం’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ఐఏఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తున్నారు.
2022-23 సంవత్సరానికిగానూ ఎంపికైన పేద అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నట్టు సోనూసూద్ ప్రకటించారు. అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు వస్తాయని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది మొదటిసారి ఉచితంగా ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన సోనూసూద్.. ఈ ఏడాది కూడా ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నట్టుగా ప్రకటించారు.
चलो मिलकर एक नया भारत बनाते हैं l
— sonu sood (@SonuSood) September 11, 2022
Launching 'Sambhavam 2022-23'. FREE online coaching for IAS exams.
Details on https://t.co/juJL7Wk4oo@diyanewdelhi@soodfoundation?? pic.twitter.com/3srQPiYB7i