ఐఏఎస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికి ఫ్రీ కోచింగ్‌

ఐఏఎస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికి ఫ్రీ కోచింగ్‌

లాక్ డౌన్ టైమ్ లో చాలామందికి సహాయం చేసిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్’ (DIYA) సహకారంతో ఉచిత ఐఏఎస్‌ కోచింగ్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ‘సంభవం’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ఐఏఎస్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యేవారికి ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తున్నారు.

2022-23 సంవత్సరానికిగానూ ఎంపికైన పేద అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇప్పించనున్నట్టు సోనూసూద్ ప్రకటించారు. అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు వస్తాయని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది మొదటిసారి ఉచితంగా ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన సోనూసూద్‌.. ఈ ఏడాది కూడా ఉచిత కోచింగ్‌ ఇప్పిస్తున్నట్టుగా ప్రకటించారు.