కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాయి. కరోనా బారిన పడిన ఎంతో మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సినీనటుడు సోనూసూద్. ఈ క్రమంలోనే కరోనా మొదటి దశ నుంచి ఎందరికో అండగా నిలబడిన సోనూసూద్.. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో విదేశాల నుంచి ప్లాంటును తెప్పించారు. ఇప్పుడు ఆ ప్లాంటు నెల్లూరుకు చేరుకుందని ఓ వీడియోను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు సోనూ.
ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నాని తెలిపారు. ఆక్సీజన్ త్వరలోనే తయారు కాబోతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు త్వరలోనే మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ప్రాణ వాయువు త్వరలో ప్రారంభం కానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంస్టాల్ చెయ్యబోతున్నాను. pic.twitter.com/y1lC3kZKKE
— sonu sood (@SonuSood) July 5, 2021