ఆస్తులు తాకట్టు పెట్టి పేదోళ్లను ఆదుకున్నడు

ఆస్తులు తాకట్టు పెట్టి పేదోళ్లను ఆదుకున్నడు

10 కోట్లకు 8 ప్రాపర్టీలను మార్టగేజ్​ పెట్టిన సోనూసూద్

న్యూఢిల్లీ: లాక్​డౌన్ టైమ్ లో పేదలు, వలస కార్మికులను ఆదుకున్న యాక్టర్ సోనూసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టినట్టు తెలిసింది. అవసరంలో ఉన్న ఆ నిరుపేదలకు హెల్ప్ చేయడానికి ముంబై జుహూలోని తన 8 ప్రాపర్టీలను రూ. 10 కోట్లకు మార్టగేజ్ చేసినట్టు ఓ వార్త బయటకొచ్చింది. తన రెండు షాపులు, ఆరు ఫ్లాట్లను సోనూ తాక‌‌‌‌ట్టు పెట్టి అప్పు తీసుకున్నారని.. దీనికి సంబంధించి సెప్టెంబ‌‌‌‌ర్ 15న అగ్రిమెంట్లపై ఆయ‌‌‌‌న సంత‌‌‌‌కం చేయ‌‌‌‌గా నవంబర్​ 24న రిజిస్ట్రేష‌‌‌‌న్ పూర్తి అయిందని సమాచారం. ఈ విష‌‌‌‌యాన్ని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియ‌‌‌‌ల్ స‌‌‌‌ర్వీసెస్ సీనియ‌‌‌‌ర్ డైరెక్టర్​ రితేశ్ మెహ‌‌‌‌తా చెప్పారని మనీ కంట్రోల్​ అనే వెబ్​సైట్​ వార్త రాసుకొచ్చింది. ‘పక్క వాళ్ల కోసం ఇలాంటి పని చేసిన వాళ్లను నేను చూడలేదు. సోనూ తాకట్టు పెట్టిన వాటిలో తనవి, తన భార్యవి కూడా ఉన్నాయి. వాటిపై వచ్చే రెంట్ వాళ్లకే చెందుతుంది. అయితే రూ. 10 కోట్ల లోన్​, వడ్డీని సోనూ చెల్లించాల్సి ఉంటుంది’ అని మనీకంట్రోల్ చెప్పింది.