హోటల్ ను నివాస బిల్డింగ్ గా మార్చిన సోనూసూద్

హోటల్ ను నివాస బిల్డింగ్ గా మార్చిన సోనూసూద్

కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో తన సేవా కార్యక్రమాలతో విశేషంగా గుర్తింపు తెచ్చుకున్నాడు సినీ నటుడు సోనూ సూద్. అయితే అయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న తన ఆరు అంతస్తుల భవంతిని పర్మిషన్ లేకుండా హోటల్ గా మార్చాని సోనూ సూద్ పై అధికారులు ఆరోపణలు చేశారు. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా, అక్రమంగా నివాస భవంతిలో మార్పులు చేసి హోటల్ గా మార్చారని ఆరోపించారు.

దీంతో బీఎంసీ సోనూ సూద్ కు నోటీసులు పంపగా, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోనూ సూద్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో సోనూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. అయితే సోనూ సూద్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

అంతేకాదు … జుహూలోని తన భవంతి హోదాను హోటల్ నుంచి నివాసం స్థాయికి మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించి సోనూ సూద్ కు చెందిన ఆర్కిటెక్ట్ లు తగిన డాక్యుమెంట్లను  బీఎంసీకి సమర్పించారు. తాను నియమనిబంధనలను పాటిస్తానని తెలిపాడు సోనూసూద్.