బాలీవుడ్ నటుడు సోనుసూద్ సుప్రీం కోర్టులో తన పిటిషన్ను ఇవాళ(శుక్రవారం) విత్ డ్రా చేసుకున్నాడు. సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోనుసూద్ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ముంబైలోని జూహు ప్రాంతంలోని ఆయన నివాసంలో అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని ఆయన జనవరి 31న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ను శుక్రవారం వెనక్కి తీసుకున్నారు.
జుహులోని ఆరు అంతస్తుల ‘శక్తి సాగర్’ బిల్డింగ్ ను హోటల్గా మార్చడంపై మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ కింద BMC జనవరి 4న జుహు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా నివాస భవనాన్ని హోటల్గా మార్చారనే ఆరోపణలతో సోనూసూద్పై FIR నవెూదు చేయాలని BMC తన ఫిర్యాదులో కోరింది. దీంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించగా పిటిషన్ను తిరస్కరించింది. మళ్లీ గత నెలలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా కొట్టివేసింది.