8 మంది ఉగ్రవాద సహచరులు అరెస్ట్

8 మంది ఉగ్రవాద సహచరులు అరెస్ట్

జమ్మూ కశ్మీర్:  అభ్యంతరకర  పోస్టర్‌లను ప్రచురిస్తూ స్థానికులను బెదిరిస్తున్న ఉగ్రవాదంతో సంబంధాలున్న 8 మంది  వ్యక్తులను సోపోర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.  పోలీసుల దర్యాప్తు ప్రకారం అరెస్టయిన ఎనిమిది మంది ఉగ్రవాదుల్లో  ముగ్గురికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (L.E.T) తో సంబంధాలు  ఉన్నట్లుగా తెలిసింది.  ఉగ్రవాదులకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న వీరంతా.. కశ్మీర్‌లో పలు దాడులకు వ్యూహం రచించారని సమాచారం.  ఈ ఎనిమిది మందిలో ఐజాజ్ మీర్, ఒమర్ మీర్, తవ్సీఫ్ నజర్, ఇమితియాజ్ నాజర్, ఒమర్ అక్బర్, ఫైజాన్ లతీఫ్, డానిష్ హబీబ్, షోకాట్ అహ్మద్ మీర్ లు ఉన్నారు. వీరంతా వివాదాస్పద పోస్టర్ లను ప్రచురిస్తూ స్థానిక ప్రాంతాల్లో పంచుతున్నారని తెలిసింది. పోలీసులు వారి నుంచి  పోస్టర్లను,  అందుకు ఉపయోగించిన కంప్యూటర్లు మరియు ఇతర ఉపకరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ ప్రాంతంలో ఇటీవల కొందరు పౌరులను హతమార్చిన కేసులో కూడా ఈ ఉగ్రవాదులపై విచారణ జరుపుతున్నారు.

Sopore Police, arrested 8 terrorist associates on Monday