ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ క్రికెట్‌  బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. షాద్ నగర్ లో ఏప్రిల్ 8వ తేదీన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పై ఓ ముఠా  క్రికెట్‌  బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి లక్షా 13వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.