
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
మేటి ఆటగాళ్లు, దిగ్గజాలకు కొదవలేదు. ప్రతి భావంతులకు లెక్కే లేదు. కానీ, ఇతర సిరీస్లు, టోర్నీలో మిగతా టాప్ టీమ్స్ కు తీసిపోని విధంగా అడే సౌతాఫ్రికా ఐసీసీ ఈవెంట్లకు వచ్చేసరికి మాత్రం అనూహ్యంగా ఆడుతుంది. అప్పటిదాకా అద్భుతంగా ఆడే ఆ జట్టు నాకౌట్ స్టేజీల్లో తడబాటును అలవాటుగా మార్చుకుంది. ఈ కారణంగా నే గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డేల్ స్టెయిన్, మఖయా ఎన్తిని, ఫా డుప్లెసిస్, మోర్నీ మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్ వంటి మేటి ఆటగాళ్లు ఒక్క ఐసీసీ ట్రోఫీ లేకుండానే తమ కె రీర్ ముగించారు. 1998లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత గత 27 ఏండ్లలో సౌతాఫ్రికన్లు 26 ఐసీసీ ఈవెంట్లలో తడబడ్డారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరినా చివరి క్షణాల్లో తడబడి చేతుల్లోకి వచ్చిన కప్పును జార విడిచారు.
కానీ, చరిత్రకు వేదికైన లార్డ్స్ లో శనివారం సఫారీ ఆట గాళ్లు తమ ముందు తరాలు చేయలేని అద్భుతాన్ని సాధించారు. టెంబా బహూమ కెప్టెన్సీలోని సఫారీలు ఒత్తిడిని జయించారు. గమ్యాన్ని ముద్దాడే వరకూ పట్టుదల చూపించారు. చివరికి గెలిచారు. కొత్త వరల్డ్ టెస్ట్ చాంపియన్లు గా సగర్వంగా నిలిచారు. ఇది వారికి కేవలం ఒక టెస్ట్ మ్యాచ్్కదు. వాళ్ల ఆత్మ విశ్వాసానికి, గుర్తింపునకు జరిగిన ఒక అగ్నిపరీక్ష.
ఈసవాల్లో సఫారీలు నెగ్గారు. కీలక సమయాల్లో కుప్పకూలడం అనే చేదు జ్ఞాపకాలతో మూడు దశ బ్రాలుగా తలదించుకుంటున్న ఆజట్టు చివరకు తన తలరాతను తానే మార్చుకుంది. తామిక చోక్సర్ కాదు చాంపియన్స్ అని సగర్వంగా చాటుకుంది. అంచనాలు తలకిందులు చేస్తూ..ఈ టోర్నీలో సౌతాఫ్రికా సులభమైన ప్రత్యర్థులతోఆడి ఫైనల్కు చేరిందని విమర్శలు వచ్చాయి.
ఎందుకంటే, 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆ టీమ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో సిరీస్ ఆడలేదు. కానీ, వరుసగా ఎనిమిది టెస్టులు గెలిచి ఆ విమర్శలకు సమాధానమిచ్చింది. వీటిలో సగం ప్రత్యర్థి వేదిక ల్లో వచ్చినవే కావడం విశేషం. అయినా ఎదురుగా ఆస్ట్రేలియా ఉండటంతో బపూమ సేనపై ఎలాంటి అంచనాలు లేవు. అపారమైన అనుభవంతో, పదునైన పేస్ దాడితో ఐరిలోకి దిగిన డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియానే ఈ మ్యాచ్లో ఫేవరెట్. కానీ సఫారీలు అంచనాలు తలకిందులు చేశారు.
లా ర్స్ లో క్లిష్టమైన పిచ్పి తొలి ఇన్నింగ్స్లో కుప్పకూ లి ప్రత్యర్థికి అధిక్యం ఇచ్చుకున్నా. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ఇన్నింగ్స్లో సెకండ్ హయ్యెస్ట్ టార్గెట్ను ఛేదించాల్సిన సవాల్ ఎదురైనప్పుడూ ఏమాత్రం తడబడలేదు. మార్ క్రమ్, టెంబా బహూమ మూడో వికెట్కు 147 రన్స్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్చి, తమ జట్టును చారిత్రాత్మక విజయం వైపు నడిపించారు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తమ జట్టు ఆడిన అతిపెద్ద వేదికపై సెంచరీతో జట్టును గెలిపించిన మారక్రమ్ ఇప్పుడు ఆ దేశ హీరో. ఇక, బవూమ కాలి కండరాల నొప్పి బాధను పంటిబిగువన భరిస్తూ ప్రశాంతంగా, ఎంతో నిబ్బ రంగా బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం.
ఈ విక్టరీ సౌతాఫ్రికాకే కాకుండా వన్నే తగ్గుతున్న టెస్టు క్రికెట్కు కూడా మేలు చేసిందని చెప్పాచ్చు.. బెస్ట్ క్రికెట్ లో రాణిస్తున్న బిగ్ త్రీ (ఇండియా, ఆస్ట్రే లియా, ఇంగ్లండ్) దేశాలకు పోటీగా మారింది. కానీ, 1992లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి తిరిగి ప్రవేశించిన తర్వాత తొలిసారిగా వచ్చే సమ్మర్లో సౌతాఫ్రికాలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా లేకపోవడం ఒక్కటే నిరాశకలిగించే అంశం.