దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అనకాపల్లి తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ పనుల కారణంగా సెప్టెంబర్ 3 నుంచి 10 తేదీల మధ్య పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విశాఖ-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805), విజయవాడ-విశాఖ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ (12717), గుంటూరు-రాగడ ఎక్స్ ప్రెస్ (17243),విశాఖపట్నం- మచిలీపట్నం(17219) మధ్య నడిచే రైళ్లను ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
విశాఖ-తిరుపతి మధ్య నడిచే (22708) డబుల్ డెక్కర్ రైలును సైతం విశాఖ - సామర్ల కోట మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా తేదీల్లో టికెట్లు, బుక్ చేసుకున్న వారి టికెట్లు ఆటోమేటిక్ గా రద్దవుతాయి. డబ్బులు రిఫండ్ అవుతాయి.