
పద్మారావునగర్, వెలుగు: ఉద్యోగులు, సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కు దేశంలోనే నాలుగో స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. బుధవారం మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కేంద్ర కార్యాలయంలో అరుణ్ కుమార్ జైన్ పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అరుణ్ కుమార్ జైన్ ను పూలమాల, బొకేలతో సత్కరించారు.
యూనియన్ జోనల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డాక్టర్ శంకర్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి అరుణ్ కుమార్ జైన్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. స్పెషల్ వార్డులు, క్యాతలిక్ ల్యాబులు, 20 గెస్ట్ రూముల నిర్మాణం చేపట్టారని తెలిపారు. సికింద్రాబాద్ జోన్ లో 15 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ నీరాజ్ అగర్వాల్, జనరల్ మేనేజర్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బ్రీజ్ మోహన్ మీనా, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మల రాజారామ్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆరోమా ఠాగూర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్దార్థ, మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.