సౌత్‌‌ జోన్‌‌ నాలుగో విక్టరీ

 సౌత్‌‌ జోన్‌‌ నాలుగో విక్టరీ

పుదుచ్చెరి:  దేవధర్‌‌ ట్రోఫీలో సౌత్‌‌ జోన్‌‌ నాలుగో విజయాన్ని అందుకుంది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో మయాంక్‌‌ అగర్వాల్‌‌ (84), సాయి సుదర్శన్‌‌ (53) రాణించడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో 5 వికెట్ల తేడాతో ఈస్ట్‌‌ జోన్‌‌ను ఓడించింది. టాస్‌‌ గెలిచిన ఈస్ట్‌‌ 46 ఓవర్లలో 229 రన్స్‌‌కు ఆలౌటైంది. విరాట్‌‌ సింగ్‌‌ (49), సేనాపతి (44), అక్ష్‌‌దీప్‌‌ (44), ముక్తార్‌‌ హుస్సేన్‌‌ (33) రాణించారు. సౌత్‌‌ బౌలర్లలో కౌశిక్‌‌, సాయి కిశోర్‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్​లో సౌత్‌‌ జోన్‌‌ 44.2 ఓవర్లలో 230/5 స్కోరు చేసి గెలిచింది. మయాంక్‌‌, సాయికి తోడుగా నారాయణ్‌‌ జగదీషన్‌‌ (32), రోహిత్‌‌ రాయుడు (24 నాటౌట్‌‌) రాణించారు.  మరో మ్యాచ్‌‌లో సెంట్రల్‌‌ జోన్‌‌ 8 వికెట్ల తేడాతో నార్త్‌‌ ఈస్ట్‌‌ జోన్‌‌పై నెగ్గింది. నార్త్‌‌ ఈస్ట్‌‌ 49 ఓవర్లలో 164 రన్స్‌‌కే కుప్పకూలింది. తర్వాత సెంట్రల్‌‌ 33 ఓవర్లలో 165/2 స్కోరు చేసి గెలిచింది.