
- ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: గణేశ్ నిమజ్జన బందోబస్తులో 11 మంది ట్రాన్స్జెండర్లను వినియోగించినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నిమజ్జనం వంటి ప్రత్యేక సందర్భాల్లో ట్రాన్స్జెండర్లను వినియోగించడం హైదరాబాద్ తర్వాత జగిత్యాల నిలిచిందని అన్నారు. గణేశ్ శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం గణేశ్ శోభాయాత్రకు వెళ్లే టవర్ సర్కిల్, లడ్డుఖాజా, తీన్ ఖనీ, చింతకుంట చెరువు ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, కరుణాకర్, రామ్ నర్సింహారెడ్డి, రవి, కిరణ్ కుమార్, వేణు, సిబ్బంది పాల్గొన్నారు.