కాంగ్రెస్ నేతలు సభ రూల్స్ పాటించడం లేదు

కాంగ్రెస్ నేతలు సభ రూల్స్ పాటించడం లేదు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. పద్దులపై చర్చ జరిగిన తరువాత కూడా కాంగ్రెస్ నేతలు మళ్ళీ అదే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ నేతలకు కావాల్సిన సమయం ఇచ్చినా ఆరోపణలు చేస్తున్నారు. భట్టి విక్రమార్క సీనియర్ సభ్యులు అయి ఉండి కూడా సభ రూల్స్ పాటించడం లేదు. సభ్యుల సంఖ్య ప్రకారం సమయాన్ని కేటాయిస్తారు. ఇష్టం వచ్చినంత సమయం మాట్లాడతామంటే కుదరదు’ అని ఆయన మండిపడ్డారు.