గడ్డి కాల్చకుండా ఆపేందుకు స్పెషల్ కమిటీ

గడ్డి కాల్చకుండా ఆపేందుకు స్పెషల్ కమిటీ

గడ్డి కాల్చుడు ఆపుడెట్ల

కమిటీని నియమించిన సుప్రీం కోర్టు

రిటైర్డ్ సుప్రీం జడ్జి జస్టిస్ లోకూర్ నేతృత్వంలో ఏర్పాటు

సొలిసిటర్ జనరల్ అభ్యంతరం.. తోసిపుచ్చిన కోర్టు

న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్​లోని పంట  పొలాల్లో గడ్డి కాల్చివేతను ఆపడానికి సుప్రీంకోర్టు వన్ మ్యాన్ ప్యానెల్ ను నియమించింది. ​ సుప్రీంకోర్టు రిటైర్డ్  జడ్జి జస్టిస్​ మదన్ బీ లోకూర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. గడ్డి కాల్చివేతను గుర్తించడంలో కమిటీకి నేషనల్ క్యాడెట్ కోర్, నేషనల్ సర్వీస్ స్కీమ్, భారత్ స్కౌట్స్ బృందాలు సాయం చేయాలంది. కోర్టు అపాయింట్​చేసిన ఎన్విరాన్​మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీతో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు లోకూర్ ప్యానెల్​కు ఫీల్డ్ విజిట్​కు సహకరించాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకోసారి కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్​ జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.  పొల్యూషన్​ లేని గాలిని ఢిల్లీ, ఎన్​సీఆర్​ ప్రాంతాల జనం పీల్చుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పింది. స్టబుల్​ బర్నింగ్​పై ఆదిత్యా దుబే అనే వ్యక్తి పిటిషన్​ వేశారు. ఢిల్లీ గాలి కాలుష్యానికి 40శాతం పంట వ్యర్థాల కాల్చివేతే కారణమని పిటిషనర్ చెప్పారు. ఎయిర్​పొల్యూషన్ వల్ల కరోనా ఎక్కువవుతుందని హార్వర్డ్ వర్సిటీ చేసిన స్టడీని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. కమిటీని నియమించింది. కమిటీ ఏర్పాటుపై కేంద్రం, రాష్ట్రాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. మెహతా కామెంట్స్​ను కోర్టు తోసిపుచ్చింది. కమిటీకి తాము మరీ ఎక్కువ అధికారాలేం ఇవ్వలేదని చెప్పింది. సంబంధిత రాష్ట్రాలు లోకూర్​కు సెక్యూరిటీ, ట్రాన్స్​పోర్టు, ఇతర సెక్రటేరియల్​ వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. ఈపీసీఏతో పాటు మిగతా అధికారులు లోకూర్​కు రిపోర్టు అందించాలంది. తీర్పును అక్టోబర్​ 26వ తేదీకి వాయిదా వేసింది.

For More News..

పంటలను మద్దతు ధరకే కొంటం.. మరోసారి స్పష్టం చేసిన మోడీ

బర్త్ డే పార్టీకి పిలిచి.. ఓయో రూంలో గ్యాంగ్ రేప్ చేసిండ్రు

కరప్షన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌దే ఫస్ట్ ప్లేస్