మందుకొట్టి బండ్లు నడిపారు... 133 మంది జైలుకు వెళ్లారు

మందుకొట్టి బండ్లు నడిపారు... 133 మంది జైలుకు వెళ్లారు

హైదరాబాద్​సిటీ, వెలుగు: రోడ్ ​సేఫ్టీ భాగంగా సిటీలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ నెలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 3,353 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ జాయింట్​సీపీ జోయల్​డేవిస్ తెలిపారు. గత కేసులతో సహా మొత్తం 5,321 చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయగా..  133 మందికి  జైలు శిక్ష పడినట్లు వివరించారు. వీరిని చంచల్​గూడ జైలుకు తరలించగా, ముగ్గురు 14 రోజులు, ఇద్దరు 10 రోజులు,  మరో128 మంది వారం రోజులపాలు జైలు శిక్ష అనుభవించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొత్తంగా  రూ. 1.14 కోట్ల- జరిమానా విధించారు.