
హైదరాబాద్సిటీ, వెలుగు: రోడ్ సేఫ్టీ భాగంగా సిటీలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ నెలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 3,353 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ జాయింట్సీపీ జోయల్డేవిస్ తెలిపారు. గత కేసులతో సహా మొత్తం 5,321 చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయగా.. 133 మందికి జైలు శిక్ష పడినట్లు వివరించారు. వీరిని చంచల్గూడ జైలుకు తరలించగా, ముగ్గురు 14 రోజులు, ఇద్దరు 10 రోజులు, మరో128 మంది వారం రోజులపాలు జైలు శిక్ష అనుభవించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొత్తంగా రూ. 1.14 కోట్ల- జరిమానా విధించారు.