గ్రేటర్వరంగల్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో స్కూల్, కాలేజీ ప్రోగామ్ స్థాయిలో ఐసీఏఆర్ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ యూనివర్సిటీగా ఎస్సాఆర్ యూ నిలిచిందని ఆ యూనివర్సిటీ చాన్సలర్ వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సాఆర్ విజయాలకు సహకరించిన టీచర్స్, సిబ్బంది స్టూడెంట్స్కు అభినందనలు తెలియజేస్తూ వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శమన్నారు.
స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల ప్రతిష్ట మరింత పెరగుతుందన్నారు. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన డిగ్రీలు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయని, విద్యార్థులు ఐసీఏఆర్ స్కాలర్షిప్స్ నకు అర్హత పొందుతారని, విశ్వవిద్యాలయానికి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్ ప్రొఫెసర్ పీవీ రమణరావు, ఆపరేషన్స్, గ్రోత్ ప్రొఫెసర్ అర్చనారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్, ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులున్నారు.

