రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలె.. యాదవ సేవ సంఘం ఆందోళన

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలె.. యాదవ సేవ సంఘం ఆందోళన

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సంఘం ఆందోళనకు దిగింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మే 15వ తేదీ సోమవారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి తలసానిని ఉద్దేశిస్తూ పెండ పిసుక్కోనే వాడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యావత్ యాదవ జాతిని కించపరిచే విధంగా ఉన్నాయని యాదవ సేవ సంఘం సభ్యులు ఆరోపించారు

అనాదిగా అణగారిన వర్గాలపై అగ్రకులాల వ్యక్తులు అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని.. వారి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని యాదవ సేవ సంఘం సభ్యులు హెచ్చరించారు.