శ్రీలంకలో బుర్ఖాలు ధరించడంపై నిషేధం

శ్రీలంకలో బుర్ఖాలు ధరించడంపై నిషేధం

శ్రీలంక ప్రభుత్వం ముస్లింలకు సంబంధించి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించడంతో పాటు..వెయ్యికి పైగా ఇస్లామిక్‌ స్కూళ్లను మూసివేయాలంటూ నిర్ణయించింది. శనివారం ఈ విషయాన్ని ప్రజా భద్రతా శాఖ మంత్రి శరత్‌ వీర శేఖర తెలిపారు. ఈ చర్యల కారణంగా దేశంలోని ముస్లిం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని...కొందరు మహిళలు పూర్తిగా మోహన్ని కప్పి ఉంచే బుర్ఖా ధరించడంపై నిషేధం విధించేందుకు క్యాబినేట్‌ ఆమోదం కోసం సంతకాలు చేసినట్లు చెప్పారు. గతంలో ముస్లిం మహిళలు, యువతులు బుర్ఖా ధరించిన ఆనవాళ్లు లేవని, ఇది మతోన్మాదానికి సంకేతమని అన్నారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేసితీరుతామన్నారు.

బుర్ఖాపై శ్రీలంక నిషేధం విధించడం కొత్తమీ కాదు. బుద్ధులు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో 2019లో చర్చిలు, హోటల్స్‌పై ఇస్లామిక్‌ మిలిటెంట్లు బాంబు దాడులు జరపడంతో...అప్పుడు తాత్కాలికంగా బుర్ఖాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఆ ఘటనలో 250 మందికిపైగా మరణించారు.