శిశుమందిరాలు సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు : మల్క కొమురయ్య

శిశుమందిరాలు సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు :  మల్క కొమురయ్య
  • టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

జమ్మికుంట, వెలుగు: శ్రీ సరస్వతీ శిశు మందిరాలు సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలని, అలాంటి సంస్థలను కాపాడుకోవాలని టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు . జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌‌లో కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు పోషకుల ఆధారంగా విద్యతో పాటు అభివృద్ధి కూడా సాధిస్తున్నామని పేర్కొన్నారు. 

రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్యకు అనుగుణంగా శ్రీ సరస్వతీ శిశు మందిరాలను తీర్చిదిద్దుదామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో హేమలత, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, లీడర్లు సునీత, శ్రీనివాసరావు, రాజమౌళి, రవీందర్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.