ముషీరాబాద్, వెలుగు : సిటీలో ఈనెల 14న జరగనున్న సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నదని బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇన్ చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హర్యానా నుంచి శ్రీకృష్ణ దున్న, పంజాబ్ రాష్ట్రానికి చెందిన షేర్ దున్నను అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ ముషీరాబాద్కు తీసుకువచ్చారు.
శనివారం ముషీరాబాద్ పరిధి సత్తర్ బాగ్లో ఆయన ఈ దున్నలను ప్రదర్శించారు. అనంతరం సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. ఖర్చుకు వెనుకాడకుండా సదర్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దున్నపోతులను ప్రత్యేక వాహనాల్లో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామని తెలిపారు. ఇవి 6 అడుగుల ఎత్తు, 2 వేల కిలోల బరువుతో ఉన్నాయని ఆయన చెప్పారు.