శ్రీనగర్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణవార్తతో జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఆయన మరణానికి నిరసనగా పలువురు షియా ముస్లింలు శ్రీనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఖమేనీ చిత్రపటాలతో వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు, తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు షియాలు లొంగిపోరని స్పష్టం చేశారు.
